హైదరాబాద్, ఏప్రిల్ 7, 2026: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ను డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ.ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి మర్యాదపూర్వంగా కలిసి విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మహనీయుల జన్మదినోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న “సామాజిక సాధికారత వారోత్సవాల” వివరాలను వివరించారు. ఆదివాసీ, ట్రాన్స్ జెండర్ విద్యార్ధులకు అందిస్తున్న ఉచిత విద్య గురించి వివరించారు. ఏప్రిల్ 14 న యూనివర్సిటీలో నిర్వహించే అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆదివాసీ విద్యార్ధులకు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించే ప్రోత్సాహక ఫెలోషిప్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు.
No comments:
Post a Comment